సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సిట్ విచారణ వేగవంతం.. పరారీలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు..!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, అలాగే స్నేహితుడు సురేష్ సహకరించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.
సీఐ నాగరాజు అరెస్టు అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజుకు బ్రోకర్గా అశోక్ వ్యవహరించగా, సీఐ అండతో వివిధ సెటిల్మెంట్లు జంగం నాని నిర్వహించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
కేసు రాజీ చేసేందుకు సాయికృష్ణ మేనమామను హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, సీఐ స్నేహితుడు సురేష్ కలిసి సంప్రదించినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరికొందరి పాత్రపైనా సిట్ ఆరా తీస్తోంది.