BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సిట్ విచారణ వేగవంతం.. పరారీలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు..!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
66 వీక్షణలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, అలాగే స్నేహితుడు సురేష్ సహకరించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.

సీఐ నాగరాజు అరెస్టు అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజుకు బ్రోకర్‌గా అశోక్ వ్యవహరించగా, సీఐ అండతో వివిధ సెటిల్మెంట్లు జంగం నాని నిర్వహించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

కేసు రాజీ చేసేందుకు సాయికృష్ణ మేనమామను హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, సీఐ స్నేహితుడు సురేష్ కలిసి సంప్రదించినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరికొందరి పాత్రపైనా సిట్ ఆరా తీస్తోంది.