BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
21 Mar, 2026 - 09:06 PM
30 వీక్షణలు

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

46 మందికి రూ.29 లక్షలకుపైగా ఆర్థిక సహాయం

పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు.

నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన మొత్తం 46 మంది లబ్ధిదారులకు రూ.29,08,965 విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి నిలుస్తుందని తెలిపారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు. అలాగే ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.