BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 21 March 2026, 09:06 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
21 Mar, 2026 - 09:06 PM
122 వీక్షణలు

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

46 మందికి రూ.29 లక్షలకుపైగా ఆర్థిక సహాయం

పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు.

నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన మొత్తం 46 మంది లబ్ధిదారులకు రూ.29,08,965 విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి నిలుస్తుందని తెలిపారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు. అలాగే ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.