సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
46 మందికి రూ.29 లక్షలకుపైగా ఆర్థిక సహాయం
పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు.
నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన మొత్తం 46 మంది లబ్ధిదారులకు రూ.29,08,965 విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి నిలుస్తుందని తెలిపారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు. అలాగే ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.