BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

ఘనంగా సర్దార్ గౌతూ లచ్చన్న జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
16 Aug, 2026 - 12:31 PM
14 వీక్షణలు

ఘనంగా సర్దార్ గౌతూ లచ్చన్న జయంతి వేడుకలు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో సర్దార్ గౌతూ లచ్చన్న 117వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఉత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొని సర్దార్ గౌతూ లచ్చన్నకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ శయన సంక్షేమ సంఘం అధ్యక్షులు కోలా బలరాం మాట్లాడుతూ సర్దార్ గౌతూ లచ్చన్న స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో సర్దార్ గౌతూ లచ్చన్న పేరుతో సామాజిక భవనాలను నిర్మించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, సర్దార్ గౌతూ లచ్చన్న సేవలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోలా బలరాం తెలిపారు.