www.ntodaynews.com
ఘనంగా సర్దార్ గౌతూ లచ్చన్న జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
ఘనంగా సర్దార్ గౌతూ లచ్చన్న జయంతి వేడుకలు
విజయనగరం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో సర్దార్ గౌతూ లచ్చన్న 117వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఉత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొని సర్దార్ గౌతూ లచ్చన్నకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ శయన సంక్షేమ సంఘం అధ్యక్షులు కోలా బలరాం మాట్లాడుతూ సర్దార్ గౌతూ లచ్చన్న స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో సర్దార్ గౌతూ లచ్చన్న పేరుతో సామాజిక భవనాలను నిర్మించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, సర్దార్ గౌతూ లచ్చన్న సేవలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోలా బలరాం తెలిపారు.