BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 March 2026, 07:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తృటిలో తప్పిన ప్రమాదం ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:04 PM
152 వీక్షణలు

తృటిలో తప్పిన ప్రమాదం  ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

చిలకలూరిపేట, సోమవారం:

మండల పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది.

సమాచారం మేరకు, కళాశాల బస్సు ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా, పసుమర్తి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం అదుపు కోల్పోయి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఉపశమనం కలిగింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి, మరో బస్సును ఘటనా స్థలానికి పంపించి విద్యార్థులను కళాశాలకు తరలించింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.