BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

తృటిలో తప్పిన ప్రమాదం ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:04 PM
51 వీక్షణలు

తృటిలో తప్పిన ప్రమాదం  ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

చిలకలూరిపేట, సోమవారం:

మండల పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది.

సమాచారం మేరకు, కళాశాల బస్సు ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా, పసుమర్తి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం అదుపు కోల్పోయి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఉపశమనం కలిగింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి, మరో బస్సును ఘటనా స్థలానికి పంపించి విద్యార్థులను కళాశాలకు తరలించింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.