BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

తృటిలో తప్పిన ప్రమాదం ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:04 PM
71 వీక్షణలు

తృటిలో తప్పిన ప్రమాదం  ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా

చిలకలూరిపేట, సోమవారం:

మండల పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది.

సమాచారం మేరకు, కళాశాల బస్సు ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా, పసుమర్తి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం అదుపు కోల్పోయి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఉపశమనం కలిగింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి, మరో బస్సును ఘటనా స్థలానికి పంపించి విద్యార్థులను కళాశాలకు తరలించింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.