BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 24 March 2026, 05:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో ఉగ్ర అనుమానితుల అరెస్ట్… రాష్ట్రవ్యాప్తంగా కలకలం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 05:52 PM
133 వీక్షణలు

విజయవాడలో ఉగ్ర అనుమానితుల అరెస్ట్… రాష్ట్రవ్యాప్తంగా కలకలం

విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతుగా పోస్టులు చేసిన ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

అరెస్ట్ చేసిన వారిలో మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్ ఉన్నారు. ప్రస్తుతం వీరిని గోప్య ప్రదేశంలో విచారిస్తున్న అధికారులు, పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని ఒక మసీదులో వీరు పరిచయం ఏర్పరుచుకున్నట్లు విచారణలో బయటపడింది. అనంతరం సోషల్ మీడియా ద్వారా మరికొందరు యువతను ప్రభావితం చేసి ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించే ప్రయత్నాలు చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో కీలక ఆధారాలను సేకరిస్తున్న దర్యాప్తు సంస్థలు, మరిన్ని వ్యక్తుల ప్రమేయంపై కూడా దృష్టి సారించాయి. ఘటనకు సంబంధించి కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.

రాష్ట్ర భద్రత దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.