BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

వినుకొండలో బంగారు దుకాణం చోరీ కేసు ఛేదనం.. అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.27 లక్షల ఆస్తి స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
55 వీక్షణలు

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షితా జ్యూయలర్స్‌లో గత నెల 21న జరిగిన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో అంతర్‌రాష్ట్ర దొంగ రఫీని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.27 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఒక బుల్లెట్ మోటార్‌సైకిల్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వివరాలను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు రఫీపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 చోరీ కేసులు నమోదై ఉన్నాయని, ఇంకా నమోదుకాని కేసులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు.

కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించి చోరీని త్వరగా ఛేదించిన వినుకొండ సీఐ ప్రభాకర్‌ను డీఎస్పీ అభినందించారు. అలాగే దర్యాప్తులో సహకరించిన పోలీసు సిబ్బంది లక్ష్మణ్, సునీల్, అశోక్, నాయక్, జయరామ్‌లకు ప్రశంసలతో పాటు రివార్డులు అందజేశారు.

పోలీసుల చాకచక్యంతో భారీ విలువైన ఆస్తి తిరిగి స్వాధీనం కావడంతో బాధితులకు ఊరట లభించింది. ఈ కేసు ఛేదనతో అంతర్‌రాష్ట్ర చోరీ ముఠాల కదలికలపై పోలీసులు మరింత అప్రమత్తంగా నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.