30 ఏళ్ల ఎదురుచూపులకు త్వరలో తెర
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి మెరకు వీధి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రత్యేక చొరవ
చింతలపూడి పట్టణంలోని మేరకు వీధి రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. గత 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న ఈ రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో మెరకు వీధి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మేరకు వీధి యువత ఆధ్వర్యంలో చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరాల మధుబాబు నేతృత్వంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ను ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యకు పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకున్న ఎమ్మెల్యేకు స్థానికులు అభినందనలు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే మేరకు వీధి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
30 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు...
అభివృద్ధికి మరో ముందడుగు!
ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్కు మెరకు వీధి యువత, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.