BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:30 AM
34 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుకు కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 1,609.23 ఎకరాలను రక్షణ శాఖ వినియోగానికి, 400 ఎకరాలను పౌర విమానయాన సేవల కోసం కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన టెర్మినల్ సదుపాయాలతో పాటు కార్గో సేవలు, విమానాల మరమ్మతు, నిర్వహణ కేంద్రం (ఎంఆర్వో), ఆధునిక రన్‌వే వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాజెక్టు అమలులో భాగంగా భూసేకరణ, రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి ప్రాథమిక పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ విమానాశ్రయం అభివృద్ధి పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వైమానిక అనుసంధానం మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.