BREAKING
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* ఇంటర్ ఫలితాల్లో శ్రీ హర్ష - శ్రీ స్పంద ఘన విజయం కళాశాలలు: తుని పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కాలేజీ మరియు శ్రీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* ఇంటర్ ఫలితాల్లో శ్రీ హర్ష - శ్రీ స్పంద ఘన విజయం కళాశాలలు: తుని పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కాలేజీ మరియు శ్రీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం
www.ntodaynews.com

బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
14 May, 2026 - 04:17 PM
15 వీక్షణలు

బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​ప్రమాదంలో గాయపడ్డ రైతుకు రూ.50 వేల ఆర్థిక సాయం ​మానవతా దృక్పథం చాటుకున్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా

​ప్రమాదంలో గాయపడ్డ రైతుకు రూ.50 వేల ఆర్థిక సాయం

​మానవతా దృక్పథం చాటుకున్న మంత్రి

​గొల్లపల్లి, మే 14:

ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండగా నిలిచారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన రైతు గుడ్ల రాజయ్య ఇటీవల జరిగిన టిప్పర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

​ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుడి కుటుంబానికి అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మంత్రి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు గురువారం బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి ఈ నగదును అందజేశారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితుడి కుటుంబం అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు అగ్గిమల్ల గ్రామస్తులు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.