BREAKING
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* ఇంటర్ ఫలితాల్లో శ్రీ హర్ష - శ్రీ స్పంద ఘన విజయం కళాశాలలు: తుని పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కాలేజీ మరియు శ్రీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* ఇంటర్ ఫలితాల్లో శ్రీ హర్ష - శ్రీ స్పంద ఘన విజయం కళాశాలలు: తుని పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కాలేజీ మరియు శ్రీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం
www.ntodaynews.com

రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
14 May, 2026 - 03:27 PM
12 వీక్షణలు

రామన్నపేటలో 64 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి రూ.1,00,116/- ఆర్థిక సాయం అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల గడప గడపకు  చేరేలా కృషి చేస్తున్నాం" అని పేర్కొన్నారు.

"ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉండకూడదు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఈ పథకం తీసుకొచ్చాం. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బు జమ చేస్తున్నాం" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, pacs చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.