పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ విస్తృత ప్రచారం
పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ వ విస్తృత ప్రచారం
చాట్రాయి మండలం పోతనపల్లి చిన్న తండాలో గురువారం నిర్వహించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న పథకాలు, సౌకర్యాల గురించి వివరించి అవగాహన కల్పించారు. కార్యక్రమం ప్రభావంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులను సమీపంలోని ఎంపీపీఎస్ ఎస్ఎల్టీ పాఠశాలలో వెంటనే చేర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ ఎస్ఎల్టీ ప్రధానోపాధ్యాయులు దారావత్ నాగేశ్వరావు, భాణావత్ శ్రీను, గ్రామ పెద్దలు దారావత్ కృష్ణ, ఎస్ఎంసీ చైర్మన్ వడిత్య కృష్ణ, దారావత్ రాము, తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ దేవమని పాల్గొన్నారు.