www.ntodaynews.com
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి
లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, పరస్పర సహకారంతో జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో సామరస్యం కొనసాగించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు