www.ntodaynews.com
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
జాతీయం
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు ‘వర్క్ ఫ్రం హోమ్’ సౌకర్యాన్ని కల్పిస్తూ సీఎం రేఖ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి రానుంది.
వాహనాల వినియోగాన్ని తగ్గించి ఇంధన పొదుపు, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కూడా నాలుగుకు పరిమితం చేశారు.
అదే సమయంలో “నా భారతదేశం - నా కర్తవ్యం” పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల్లో ప్రజా రవాణాపై అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం “మండే మెట్రో” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.