Tirumala: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ భారీ కానుక.. టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
తిరుమల | NTODAY NEWS
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ విరాళం అందించారు.
తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ, భక్తుల రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సులను తిరుమలలో భక్తుల రవాణా కోసం వినియోగించనున్నట్లు సమాచారం. బస్సులతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, అలాగే డ్రైవర్ల జీతభత్యాల వ్యయాన్ని కూడా రిలయన్స్ సంస్థ భరించనుంది.
ఈ విరాళం ద్వారా తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థకు మరింత బలం చేకూరనుండగా, ప్రతి రోజు శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.