BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
14 May, 2026 - 03:28 PM
57 వీక్షణలు

నీట్ పేపర్ లీకేజీపై రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం

గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్నీ నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామన్నపేట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బట్టె సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్‌కి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. మోడీ పాలనలో వరుస పేపర్ లీకులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మోడీ ప్రభుత్వంలో గత పదేళ్లలో 89 పేపర్ లీకులు కాగా, 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించడం సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం దేశ ప్రజానికానీకి సమాధానం చెప్పాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, కోట సుధాకర్, కేశవదాసు వెంకటేష్, బొడ్డు సురేందర్ రావు, ఏటెల్లి పరమేష్, చల్లా సత్యప్రకాష్, బండ లింగస్వామి, ఇనాయతుల్లా బైగ్, గుండాల సతీష్, పెరమల్ల నవీన్, తెల్ల శేఖర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బైరబోయిన శోభా, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కల్లూరి శివ, కందగట్ల రాహుల్, యువజన కాంగ్రెస్ నాయకులు పల్లపు రవి, జవ్వాజి శ్రీకాంత్, కన్నెబోయిన రవీందర్, సింగరాజు యశ్వంత్, అంజద్, అజార్, కందుల మణి, నల్లబాల శరత్, సుర్వి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.