BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చాట్రయి పోలీసుల పటిష్ట చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 07:41 PM
201 వీక్షణలు

చాట్రయి పోలీసుల పటిష్ట చర్యలు – మహనీయుల విగ్రహాలకు కట్టుదిట్టమైన రక్షణ

చాట్రయి, ఏప్రిల్ 3: చాట్రయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహనీయుల విగ్రహాల రక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో ఈ ప్రత్యేక భద్రతా కార్యక్రమం అమలు చేస్తున్నారు.

నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రయి ఎస్ఐ డి. రామకృష్ణ సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను పరిశీలిస్తూ, ఆయా విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశమై రక్షణ చర్యలపై కీలక సూచనలు చేశారు.

విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి ఎల్లప్పుడూ పని చేసేలా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గౌరవాన్ని కాపాడాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు.

అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై స్థానిక యువత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహనీయుల విగ్రహాలకు హాని కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ డి. రామకృష్ణ హెచ్చరించారు.

గ్రామాల్లో శాంతిభద్రతలు నిలుపుకోవడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేశారు.