www.ntodaynews.com
నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం
నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులోని నల్లమలను ఆనుకుని ఉన్న గట్టు తాండ వద్ద పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. గట్టు తాండాకు చెందిన రెడ్యా నాయక్కు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా, ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులకు ఆవుల మంద యజమాని రెడ్యా నాయక్ ఫిర్యాదు చేశారు.
పెద్దపులి అడవిని వదిలి గ్రామ శివార్లకు రావడంతో మరిన్ని పశువులపై దాడులు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.