దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ
దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రాష్ట్రంలో దళిత క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ స్పీకర్ కుల, మత వివక్షలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
అలాగే రఘురామకృష్ణం రాజుపై తక్షణమే చర్యలు తీసుకొని, పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.