BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

​నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
05 Jul, 2026 - 07:32 AM
1,264 వీక్షణలు

నలగొండ జిల్లా చిట్యాల 65వ  నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాకినాడకు చెందిన కొందరు వ్యక్తులు కారులో విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. కారు పెద్దకాపర్తి శివారు ప్రాంతానికి చేరుకోగానే, వెనుక నుండి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ​ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై, కారులోనే శవమై తేలారు. ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

​ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో అత్యంత శ్రమతో బయటకు తీశారు. మృతుల వద్ద లభించిన ఐడెంటిటీ కార్డులు, ఆధారాల ఆధారంగా వారు కాకినాడ వాసులుగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.