BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

​నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
05 Jul, 2026 - 07:32 AM
1,354 వీక్షణలు

నలగొండ జిల్లా చిట్యాల 65వ  నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాకినాడకు చెందిన కొందరు వ్యక్తులు కారులో విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. కారు పెద్దకాపర్తి శివారు ప్రాంతానికి చేరుకోగానే, వెనుక నుండి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ​ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై, కారులోనే శవమై తేలారు. ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

​ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో అత్యంత శ్రమతో బయటకు తీశారు. మృతుల వద్ద లభించిన ఐడెంటిటీ కార్డులు, ఆధారాల ఆధారంగా వారు కాకినాడ వాసులుగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.