BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

చైర్మన్ రేసులో ఎవరికి ఛాన్స్?

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 09:33 PM
14 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్ పదవిపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ప్రస్తుత సంఘాలకు నామినేటెడ్ ఇన్‌ఛార్జి కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి కమిటీలో ఒక చైర్‌పర్సన్‌తో పాటు 12 మంది సభ్యులు ఉంటారు. వీరు ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు జరిగే వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో పొగుళ్లపల్లి ప్యాక్స్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు మండలానికి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సహకార సంఘాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అర్హులైన వారికే అవకాశం కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మంత్రి ఆదేశాలు, పార్టీ అధిష్టానం వైఖరి నేపథ్యంలో ఈ కీలక పదవి ఎవరికి దక్కనుందనే దానిపై మండలంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికలు జరిగే వరకు ఈ పదవిని చేపట్టడం ద్వారా తమ రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్న నాయకులు అధిష్టానం తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.