BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

పార్టీ పేరుపై వెనకడుగు లేదు.. న్యాయపోరాటానికి సిద్ధం: కవిత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 09:33 PM
15 వీక్షణలు

హైదరాబాద్: పార్టీ పేరు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని మాజీ ఎమ్మెల్సీ  స్పష్టం చేశారు. పార్టీ పేరును మార్చాలని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. కొత్త పేర్లు పెట్టే ఆలోచనే లేదని, పార్టీ పేరుపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

"పార్టీ పేరు కోసం అవసరమైతే చివరి వరకు పోరాడతాం. చట్టపరంగా మా హక్కులను కాపాడుకుంటాం. ఎవరైనా రాజకీయ కుట్రల్లో భాగంగా పార్టీ పేరును లక్ష్యంగా చేసుకుంటే చూస్తూ ఊరుకోం" అని కవిత వ్యాఖ్యానించారు.

పార్టీ పేరు విషయంలో అనవసరంగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల్లో గందరగోళం కలిగించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలతో మమేకమైన పేరును మార్చే ఆలోచనే లేదని పేర్కొన్నారు.

అవసరమైతే కోర్టులను ఆశ్రయించి న్యాయపరంగా తమ వాదనను బలంగా వినిపిస్తామని, చట్టం తమకు అనుకూలంగా ఉందనే పూర్తి నమ్మకం ఉందని కవిత చెప్పారు. పార్టీ పేరు, గుర్తింపు, సిద్ధాంతాలను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలతో పార్టీ పేరుపై నెలకొన్న చర్చకు మరింత వేడి రాజుకుంది. కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని నింపాయి.