BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి : సీపీఎం నాయకుల నివాళులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
04 Jul, 2026 - 07:56 PM
68 వీక్షణలు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని శనివారం వెలిమినేడు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి సీపీఎం మండల నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా జోహార్లు అర్పించారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం, భూమి కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు అరూరి శ్రీను, నెలికంటి నర్సింహా, పంది నరేష్‌లతో పాటు పార్టీ ప్రముఖ నాయకులు అరూరి శంభయ్య, నాతి కిరణ్, అరూరి ప్రణీత్, మామిడి రాములు, బొంతల ఉపేందర్ రెడ్డి, సాయికిరణ్, బిక్షమయ్య తదితరులు పాల్గొని అమరవీరుడు దొడ్డి కొమురయ్యకు నివాళులు అర్పించారు.