www.ntodaynews.com
ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి : సీపీఎం నాయకుల నివాళులు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
వెలిమినేడు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని శనివారం వెలిమినేడు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి సీపీఎం మండల నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా జోహార్లు అర్పించారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం, భూమి కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు అరూరి శ్రీను, నెలికంటి నర్సింహా, పంది నరేష్లతో పాటు పార్టీ ప్రముఖ నాయకులు అరూరి శంభయ్య, నాతి కిరణ్, అరూరి ప్రణీత్, మామిడి రాములు, బొంతల ఉపేందర్ రెడ్డి, సాయికిరణ్, బిక్షమయ్య తదితరులు పాల్గొని అమరవీరుడు దొడ్డి కొమురయ్యకు నివాళులు అర్పించారు.