BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

పెనుగొలనులో స్వామి వివేకానంద వర్ధంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
35 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో యుగపురుషుడు, భారతీయ ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు మాట్లాడుతూ భారతీయ సనాతన సంప్రదాయాన్ని, హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యుగానికి ఒక్కసారే జన్మించే మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.

1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో "అమెరికా సోదరి సోదరులారా" అంటూ ప్రారంభించిన ఆయన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మ వైభవాన్ని చాటిందని తెలిపారు. తన గురువు రామకృష్ణ పరమహంస బోధించిన "మానవసేవయే మాధవసేవ" అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ను స్థాపించిన గొప్ప మానవతావాది స్వామి వివేకానంద అని అన్నారు.

నేటి సమాజంలో యువతకు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధనలు అత్యంత అవసరమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి భక్తులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.