BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

వి.బి గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
13 వీక్షణలు

రమణక్కపేట, జూలై 4: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలని, వి.బి గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ముసునూరు మండల కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.

అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం (అయర్లా) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యురాలు పల్లెపాము భవాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య మాట్లాడుతూ, 2005లో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి ఆకలి సమస్యను నివారించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు.

ఈ చట్టం ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి లభించి వారి జీవనోపాధి మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా ఊతమిచ్చిందన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వి.బి గ్రామ్ జీ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. పని దినాలు పెంచినప్పటికీ నిధులు తగ్గించడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రమణక్కపేట గ్రామంలో కేవలం ఆరు వారాలపాటు మాత్రమే పని కల్పించి ప్రస్తుతం నిలిపివేశారని, ఈ విషయంపై గతంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామీణ కార్మికులకు 125 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.700 కూలీ చెల్లించాలని, పేస్ యాప్‌ను రద్దు చేయాలని, పారా, తట్టా, పలుగు అలవెన్సులు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నందిపాము రాణి, నందిపాము నవ్య, నందిపాము చిట్టెమ్మ, నందిపాము రాహేలు, ఆముదాల నాగరత్నం, ఆముదాల శాంత, మంద మార్తమ్మ, దారా బేబీ షాలిని, ఉయ్యూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.