వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో శనివారం నార్కట్పల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. క్లబ్ ట్రెజరర్ పంతంగి కరుణాకర్ గౌడ్ కుమారుడు అఖిలేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, కిరాణా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నరసింహ గౌడ్, చార్టర్ ప్రెసిడెంట్ జనగాం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మానవ సేవనే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని, పుట్టినరోజులను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పొన్నం లక్ష్మయ్య గౌడ్, దంతూరి సైదులు గౌడ్, బెల్డ సత్యనారాయణ, రంగా వెంకటేశ్వర్లు, బాలాగోని రాజు గౌడ్, పల్ల వెంకటేశ్వర్లు, పబ్బతి సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహకులు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.