అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం : ఎమ్మెల్యే వేముల వేముల
ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడమే ధ్యేయంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల పట్టణంలో గల శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాలకు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్లు బూత్ లెవెల్ ఏజెంట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమన్వయంతో పనిచేయాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా బూత్ స్థాయిలో అధికారులు, ఏజెంట్లు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని . ప్రజలందరికీ ఈ సర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఏజెంట్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.