BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:15 PM
114 వీక్షణలు

మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు, గిరిజన వాచర్ల సహాయంతో రహస్యంగా తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.

అటవీ ప్రాంతంలో జరిగిన ఈ తవ్వకాల సమయంలో రెండు భారీ మట్టి కుండలు బయటపడ్డాయని, వాటిలో బంగారం, వజ్రాలు ఉన్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతోనే అధికారులు తవ్వకాలు చేపట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్వకాల అనంతరం దొరికిన విలువైన వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట వాటిని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించారని, అది సాధ్యంకాకపోవడంతో బెంగళూరులో విక్రయించారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలోని యర్రకుంట్ల సమీప అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితమే ఈ తవ్వకాలు జరిగినట్టు సమాచారం. వెలగలపాయ అటవీ బీట్ అధికారికి యర్రగొండపాలెంకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అనంతరం గిరిజన వాచర్ల సహాయంతో భారీ స్థాయిలో తవ్వకాలు నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది.

తవ్వకాల సమయంలో తీసిన వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు తెలిసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.