నార్కట్పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్తో పోలీసుల అకస్మిక తనిఖీలు
నార్కట్పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్తో పోలీసుల అకస్మిక తనిఖీలు NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం నార్కట్పల్లి టౌన్లో పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన గంజాయి గుర్తింపు శునకం (స్నిఫర్ డాగ్) సహాయంతో స్థానిక బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, పాన్ షాపులు, హోటళ్లు మరియు యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ఈ అకస్మిక తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిఘా ఉంచేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
ఈ తనిఖీల సందర్భంగా స్థానిక ప్రజలకు, యువతకు మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయి.అని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి, సన్ ఇన్సెక్టర్ విష్ణు మూర్తి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..