www.ntodaynews.com
ఏలూరు: నేటి నుంచి పాపికొండల బోటింగ్ యాత్ర పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
భద్రతా కారణాలతో కొంతకాలంగా నిలిపివేసిన పాపికొండల బోటింగ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నేటి నుంచి పాపికొండల సందర్శనకు బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
గోదావరి అందాలు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాజమండ్రి పుష్కర ఘాట్తో పాటు భద్రాచలం నుంచి కూడా బోటింగ్ యాత్రలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.
పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. బోట్లలో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని, భద్రతా నిబంధనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు