www.ntodaynews.com
చిత్తూరులో ఛార్జర్ పేలడంతో ఇంట్లో మంటలు 90వేలు నష్టం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
చిత్తూరు, పుంగనూరు ప్రతినిధి
తవణంపల్లి(M) ఎగువతడకరా ఈ. వెంకటాపురంలో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ ఛార్జర్ పేలడంతో మాజీ సర్పంచ్ దివంగత సుబ్రహ్మణ్యం శెట్టి నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.90 వేల నగదు, పట్టు వస్త్రాలు, లైట్లు, టీవీతో పాటు ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. వారు ఇంటి తాళాలు పగులగొట్టి మంటలను ఆర్పేశారు.