www.ntodaynews.com
అంతరాష్ట్ర ముఠా దొంగలు అరెస్టు 17.94 లక్షలు బంగారు సాధనం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
పీలేరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుండి రూ. 17.94 లక్షల విలువైన 109 గ్రాముల బంగారం ఆభరణాలను ఒక బైక్ను స్వాధీనం చేసుకుని, పీలేరు పరిధిలోని 7 దొంగతనం కేసులను ఛేదించారు. ప్రజలు ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.