BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

ఇంకా వీడని జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. 29 రోజులైనా ఆచూకీ లేదు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
21 వీక్షణలు

కాకినాడ జిల్లా తునిలో 29 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారి కోసం తల్లిదండ్రులు కళ్లల్లో ఆశతో ఎదురుచూస్తుండగా, స్థానికుల్లోనూ తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

చిన్నారి తల్లి భవాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, "ఎవరైనా నా పాపను తీసుకెళ్లి ఉంటే దయచేసి సురక్షితంగా అప్పగించండి. మీపై ఎలాంటి కేసులు పెట్టను. నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేయండి" అంటూ వేడుకున్నారు. తల్లి ఆర్తనాదం స్థానికులను కలచివేస్తోంది.

ఇదిలా ఉండగా, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు, ఇతర కీలక సమాచారాన్ని పరిశీలిస్తూ విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం.

దాదాపు నెలరోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని ప్రజలు, బంధువులు ప్రార్థిస్తున్నారు. అయితే ఈ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారడంతో చిన్నారి కోసం అన్వేషణ మరింత ఉత్కంఠగా మారింది.