BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఇంకా వీడని జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. 29 రోజులైనా ఆచూకీ లేదు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
77 వీక్షణలు

కాకినాడ జిల్లా తునిలో 29 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారి కోసం తల్లిదండ్రులు కళ్లల్లో ఆశతో ఎదురుచూస్తుండగా, స్థానికుల్లోనూ తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

చిన్నారి తల్లి భవాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, "ఎవరైనా నా పాపను తీసుకెళ్లి ఉంటే దయచేసి సురక్షితంగా అప్పగించండి. మీపై ఎలాంటి కేసులు పెట్టను. నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేయండి" అంటూ వేడుకున్నారు. తల్లి ఆర్తనాదం స్థానికులను కలచివేస్తోంది.

ఇదిలా ఉండగా, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు, ఇతర కీలక సమాచారాన్ని పరిశీలిస్తూ విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం.

దాదాపు నెలరోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని ప్రజలు, బంధువులు ప్రార్థిస్తున్నారు. అయితే ఈ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారడంతో చిన్నారి కోసం అన్వేషణ మరింత ఉత్కంఠగా మారింది.