www.ntodaynews.com
స్టేషన్లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..!
తెలంగాణ
/
హైదరాబాద్
స్టేషన్లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..!
సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మహిళ ఎస్సై నందిత ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. ఓ కేసు వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసిన నందిత, “స్టేషన్లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ బాధితుడిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.
లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటుండగా నందితను పట్టుకున్నారు.
ఈ ఘటనతో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.