www.ntodaynews.com
నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..!
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు కు“గబ్బర్ సింగ్” రీ-ఎంట్రీ..!
నూజివీడు రూరల్ సీఐగా ఐ.వి. నాగేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2012 నుంచి 2013 వరకు నూజివీడులో ఎస్సైగా పనిచేసిన సమయంలో నేరాల నియంత్రణలో కఠిన వైఖరి అవలంబించి “గబ్బర్ సింగ్”గా ప్రత్యేక గుర్తింపు పొందారు.
తాజాగా నూజివీడు రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన నాగేంద్ర కుమార్, ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, ముసునూరు, చాట్రాయి మండలాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల అరికట్టడం, ప్రజలకు భరోసా కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమస్యలపై ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.