BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చింతలపూడిలో అధికలోడుతో దూసుకెళ్తున్న ఇసుక లారీలు.. ప్రమాదాలపై పట్టణవాసుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
62 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడిలో అధికలోడుతో దూసుకెళ్తున్న ఇసుక లారీలు.. ప్రమాదాలపై పట్టణవాసుల ఆందోళన

ఎలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో అధికలోడుతో వేగంగా దూసుకెళ్తున్న ఇసుక లారీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అధికంగా లోడ్ చేసి తరలిస్తుండటంతో లారీల నుంచి ఇసుక రోడ్డుపై జారిపడుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారుల కళ్లల్లో ఇసుక పడుతూ అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు వాపోతున్నారు.

ప్రధాన రహదారులపై ఇసుక లారీలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల చిన్నపాటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక లారీల అధికలోడును అరికట్టి, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.