చింతలపూడిలో సుందరీకరణ పనులు వేగవంతం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని మినీ బస్టాండ్ వద్ద చేపట్టిన సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ఫౌంటెన్ పనులను స్థానిక శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 15న వాటర్ ఫౌంటెన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా చింతలపూడి పట్టణంలోని గురుబట్లగూడెం రహదారి కూడలిలో మరో వృత్తాకార వాటర్ ఫౌంటెన్ నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే చింతలపూడి మరింత అందంగా, ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఈ పరిశీలనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.