BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చింతలపూడిలో సుందరీకరణ పనులు వేగవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:26 PM
37 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని మినీ బస్టాండ్ వద్ద చేపట్టిన సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ఫౌంటెన్ పనులను స్థానిక శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 15న వాటర్ ఫౌంటెన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా చింతలపూడి పట్టణంలోని గురుబట్లగూడెం రహదారి కూడలిలో మరో వృత్తాకార వాటర్ ఫౌంటెన్ నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే చింతలపూడి మరింత అందంగా, ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ఈ పరిశీలనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.