BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

చింతలపూడిలో సుందరీకరణ పనులు వేగవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:26 PM
41 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని మినీ బస్టాండ్ వద్ద చేపట్టిన సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ఫౌంటెన్ పనులను స్థానిక శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 15న వాటర్ ఫౌంటెన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా చింతలపూడి పట్టణంలోని గురుబట్లగూడెం రహదారి కూడలిలో మరో వృత్తాకార వాటర్ ఫౌంటెన్ నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే చింతలపూడి మరింత అందంగా, ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ఈ పరిశీలనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.