డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన అదనపు ప్రేమ్ కరణ్ రెడ్డి
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన అదనపు ప్రేమ్ కరణ్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు, పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు పంపిణీ ఈ కార్యక్రమం చేపడతామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో మిగిలిన పనులను పూర్తి చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ లోకిలాల్, హౌసింగ్ డీఈ అబ్దుల్ వజీద్, ఏఈ ప్రీతి, మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత రమేష్, కమిషనర్ గురులింగం, వైస్ చైర్పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, మున్సిపల్ కౌన్సిలర్లు, హౌసింగ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.