ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ‘ప్రజావాణి’ రద్దు: కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల:-ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, దరఖాస్తుదారులు మరియు ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు. తిరిగి మే 4వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు తమ ఫిర్యాదులను ఆ రోజున సమర్పించుకోవచ్చని జిల్లా పౌర సంబంధాల అధికారి ఈ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు