BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Apr, 2026 - 07:58 PM
119 వీక్షణలు

రైతు సంక్షేమమే ధ్యేయం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు

లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

రైతులు ​దళారులను నమ్మి మోసపోవద్దు: గ్రామ సర్పంచ్ 

ఆకుల సుమన్ గౌడ్ 

​ధర్మపురి/లోత్తునూరు, ఏప్రిల్ 25   రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ మరియు లోత్తునూరు గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, శనివారం సాయంత్రం లోత్తునూరు గ్రామంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మాట్లాడుతూ.. కష్టపడి పండించిన పంటను రైతులు తక్కువ ధరకు అమ్ముకొని దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ కొనుగోలు కేంద్రాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రం వద్ద తాగునీరు, నీడ వంటి అన్ని కనీస సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

​పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒరగంటి మల్లేష్, వార్డు సభ్యులు బోనాల రాజు, కొప్పు శ్రీను, పీఏసీఎస్ డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.