BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 06:00 PM
103 వీక్షణలు

యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు - MLA రోషన్ కుమార్ హితవు

చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు నూతనంగా వచ్చిన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రస్తుత సమాజంలో యువత క్రికెట్ బుకీలు, బెట్టింగులు, సోషల్ మీడియా పోస్టులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న పరిస్థితులకు దూరంగా ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన యువతకు ఉద్బోధించారు.

శనివారం ఉదయం స్థానిక సిఐ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా సర్కిల్ ఇన్స్పెక్టర్కు కేటాయించిన వాహనాన్ని ప్రారంభించి, అనంతరం సర్కిల్ కార్యాలయం పరిశీలించారు.

సర్కిల్ కార్యాలయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం కనిపిస్తోందని MLA రోషన్ కుమార్ స్థానిక సిఐ క్రాంతి కుమార్ ను అభినందించారు.

ప్రజల రక్షణకు నిరంతరం శ్రమించే పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నేరాల అదుపులో పోలీసులు ఉపయోగిస్తున్న శాస్త్రీయ పరిజ్ఞానం నేర పరిశోధనకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.