యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు
యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు - MLA రోషన్ కుమార్ హితవు
చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్కు నూతనంగా వచ్చిన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రస్తుత సమాజంలో యువత క్రికెట్ బుకీలు, బెట్టింగులు, సోషల్ మీడియా పోస్టులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న పరిస్థితులకు దూరంగా ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన యువతకు ఉద్బోధించారు.
శనివారం ఉదయం స్థానిక సిఐ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా సర్కిల్ ఇన్స్పెక్టర్కు కేటాయించిన వాహనాన్ని ప్రారంభించి, అనంతరం సర్కిల్ కార్యాలయం పరిశీలించారు.
సర్కిల్ కార్యాలయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం కనిపిస్తోందని MLA రోషన్ కుమార్ స్థానిక సిఐ క్రాంతి కుమార్ ను అభినందించారు.
ప్రజల రక్షణకు నిరంతరం శ్రమించే పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నేరాల అదుపులో పోలీసులు ఉపయోగిస్తున్న శాస్త్రీయ పరిజ్ఞానం నేర పరిశోధనకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.