జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...
జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ని కోరిన జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...
పార్టీ యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ శనివారం మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలవడం జరిగింది. రాయల్ కుమార్ కలెక్టర్ కు పుంగనూరు పట్టణం లో గల సమస్యలగురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ స్టంక్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని,పుంగనూరు టౌన్ లో బస్ షెల్టర్ నిర్మాణం గురించి ఎన్.ఎస్ పేట లో గల వాకింగ్ ట్రాక్ పునరుద్దరణ ( CC కెమెరా, నైట్ పోలీస్ విజిలెన్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది.మరియు చిన్న పిల్లల ఆడుకోవడానికి అట స్థలము కూడ ఏర్పటూ చేయాలాని కోరడం జరిగింది. దీనితో పాటుగా పుంగనూరు టౌన్ లో గల స్క్రాప్ డంపింగ్ యార్డ్ ని తొలగించాలని కోరడం జరిగింది.ఈ విషయం పై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ వారి ముందే సీసీ మరియు అనుబందిత అధికారులతో మాట్లాడటం జరిగింది .వేసవి దృష్ట్యా ప్రయాణికులకు వెంటనే బస్ షెల్టర్స్ ఏర్పాటు కోసం చర్య తీసుకుంటామని తెలిపారు.మిగిలిన సమస్యలపై త్వరగా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కుమార్ మరియు జనసేన నాయకులు అన్నమల విశ్వనాథ, నానాబాల ఉదయ్, జయకుమార్ (కాలు) తదితరులు పాల్గొన్నారు