www.ntodaynews.com
పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ
మే నెలలో చెల్లించేవారికి వర్తింపు.
ఆంధ్రప్రదేశ్ పుర, నగరపాలక సంస్థల తరహాలో పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ మొదటిసారి ప్రకటించారు.
మే 1 నుంచి 31లోపు 2026-27 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లించేవారికి రాయితీ ఇవ్వనున్నారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది.
మే 1 నుంచి స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆస్తి పన్ను చెల్లించొచ్చు.
ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ విజ్ఞప్తి చేశారు.