www.ntodaynews.com
సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: మాజీ ఎమ్మెల్యే డిమాండ్
దండేపల్లి: దండేపల్లి మండలంలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. శనివారం దండేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని సమాచారం అందుతున్నా, గ్రామాల్లో ఇంకా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు