www.ntodaynews.com
ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు సాఫ్ట్వేర్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ రాములు వెల్లడించారు. ఈ ఆధునీకరించిన సాఫ్ట్వేర్ ద్వారా కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లులకే ధాన్యాన్ని తరలించడం సులభతరమవుతుందని, ప్రతి మిల్లు యొక్క సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రవాణా సమయం గణనీయంగా తగ్గి, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన సాగుతుందని ఆయన స్పష్టం చేశారు