ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా - విస్సన్నపేట.విస్సన్నపేటలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రంగా-రాధ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగా ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని, ఆయన నిజాయితీకి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన ఈ రోజున బ్రతికి ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో మరో ప్రత్యేకమైన మార్పు వచ్చేదని అభిప్రాయపడ్డారు.
జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, పెద్ద సంఖ్యలో ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు, మిత్రమండలి సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.