BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులకు ఘన స్వాగతం.. మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:58 AM
16 వీక్షణలు

జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి ఆత్మీయ అభినందనలు తెలిపారు.

ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాకు వచ్చిన పరిశీలకులతో కలెక్టర్ కీలక అంశాలపై చర్చించారు. ఓటర్ల జాబితా పారదర్శకత, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా ప్రక్రియ కొనసాగించే అంశాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.