www.ntodaynews.com
కూసుమంచిలో మొహరం సందడి.. ఊరేగుతున్న పీరీలు.. చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ ఊపిరి!
తెలంగాణ
/
ఖమ్మం
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మొహరం సందర్భంగా భారీ పీరీల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కూసుమంచిలో ప్రతి ఏటా పెద్ద పెద్ద పీరీలు అధిక సంఖ్యలో ఊరేగడం ఈ వేడుకల ప్రత్యేకత.
సాయంత్రం 4 గంటల నుంచి పాత మసీద్ సెంటర్లో జాతర ప్రారంభమై భక్తులు, ప్రజలతో సందడిగా మారుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు పీరీలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కూసుమంచి వాసులకు ఈ మొహరం వేడుకలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మధురస్మృతులను మరోసారి సజీవం చేస్తున్నాయి. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకుంటున్నారు.