BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

మధిర జమియా మసీదుకు మౌలిక వసతులు కల్పించాలి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:49 PM
6 వీక్షణలు

నూతన షాదీఖానా నిర్మించాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతి

వందేళ్ల చరిత్ర కలిగిన మసీదు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం

డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత

మధిర, ఆగస్టు 29:

మధిర పట్టణంలోని చారిత్రాత్మక జమియా మసీదు (మర్కజ్) అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో నూతన షాదీఖానా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు శనివారం తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్ ఇషాతి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మధిర మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ సామినేని సుజాతను కలిసి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా మౌలానా షేక్ ముజాహిద్ ఇషాతి మాట్లాడుతూ.. వందేళ్ల చరిత్ర కలిగిన జమియా మసీదుకు మధిర పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. అయితే నమాజుకు ముందు వజూ చేసుకునేందుకు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మసీదు ప్రాంగణంలో వజూ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే ముస్లిం జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షాదీఖానా సరిపోవడం లేదని తెలిపారు. వివాహాలు, శుభకార్యాల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తూ ఆర్థిక భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో కొత్త షాదీఖానా నిర్మాణం చేపడితే పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

వినతిపై మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు సయ్యద్ రసీదు, ఎస్.కె. బాజీ, గౌస్ ఉద్దీన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.