BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:48 PM
5 వీక్షణలు

ప్రథమ సెమిస్టర్ విద్యార్థులకు ఉచిత తెలుగు అధ్యయన సామగ్రి పంపిణీ

ఖమ్మం జిల్లా మధిర:

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష గొప్పతనం, తెలుగు సాహిత్య వైభవం, భాష పరిరక్షణ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకత, సాహిత్య సంపదను వివరించారు. విద్యార్థులు తెలుగు భాషపై అభిమానం పెంపొందించుకొని, నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. భాష అభివృద్ధి, పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రథమ సెమిస్టర్ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన అధ్యయన సామగ్రిని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో తెలుగు భాష, సాహిత్యంపై మరింత ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ, అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఇందిర, డాక్టర్ పి. సుజాత, పి. లక్ష్మీనారాయణ, పి. శ్రీనివాస్, డాక్టర్ వి. నాగరాజు, డాక్టర్ ఎం.వి. శర్మ, ఎం.వి.ఎస్. శర్మ, ఎస్. జ్యోతి, ఎస్. పృథ్వీరాజ్, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.