BREAKING
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం రెవెన్యూ కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే పని లేదంటే పని కాదు- రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ మీసేవ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం.. పథకాల గడువు ముగుస్తున్నా అందని వైనం! యాదమ్మకు నివాళులు అర్పించిన దైద రవీందర్ హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం రెవెన్యూ కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే పని లేదంటే పని కాదు- రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ మీసేవ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం.. పథకాల గడువు ముగుస్తున్నా అందని వైనం! యాదమ్మకు నివాళులు అర్పించిన దైద రవీందర్ హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన
www.ntodaynews.com

మీసేవ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం.. పథకాల గడువు ముగుస్తున్నా అందని వైనం!

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 May, 2026 - 08:37 AM
56 వీక్షణలు

మీసేవ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం.. పథకాల గడువు ముగుస్తున్నా అందని వైనం!

​పైసలు తీసుకుంటున్నా ఆలస్యమెందుకు? జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల ప్రజల ఆగ్రహం

​వెల్గటూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉపాధి హామీ, కొత్త పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. అయితే, ఈ సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలకు సకాలంలో అవి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లిస్తున్నప్పటికీ, సర్టిఫికెట్ల జారీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల ప్రజలు మండిపడుతున్నారు.

​బోర్డులకే పరిమితమైన గడువు (SLA Time)!

​మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గడువు (SLA Time) కేవలం బోర్డులకే పరిమితమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

​ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate): రూ. 80 ఫీజుతో 7 పనిదినాల్లో రావాల్సి ఉండగా, వారాలు గడుస్తున్నా జాడ లేదు.

​నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate): దీనికి కూడా రూ. 80 ఫీజు, 7 రోజుల గడువు ఉన్నప్పటికీ సకాలంలో అందడం లేదు.

​కుల ధృవీకరణ పత్రం (Community Certificate): రూ. 80 ఫీజుతో 30 పనిదినాల గడువు ఉన్నా, నెలలు గడుస్తున్నా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.

​మీసేవ కేంద్రాలకు వెళ్లి ఎన్నిసార్లు అడిగినా "ఇంకా కాలేదు.. ప్రాసెస్‌లో ఉంది" అనే సమాధానమే వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​గడువు ముగిసిపోతే బాధ్యులెవరు?

​"మేమేమీ ఉచితంగా సర్టిఫికెట్లు అడగడం లేదు, ప్రభుత్వం నిర్ణయించిన రూ. 80 ఫీజు పూర్తిగా చెల్లిస్తున్నాం. మరి అలాంటప్పుడు ఇంత ఆలస్యం ఎందుకు?" అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్టిఫికెట్లు వచ్చేలోపు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల దరఖాస్తు గడువు ముగిసిపోతే, ఆ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని వెల్గటూర్ మండల ప్రజలు నిలదీస్తున్నారు.

​ఒకవైపు పథకాలకు సర్టిఫికెట్లు కచ్చితంగా కావాలంటూనే, మరోవైపు వాటి జారీలో ఇంత నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతాధికారులను ఆదేశించి సర్టిఫికెట్లు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు